1
అశోచ్యా నన్వశోచస్త్వమ్ - ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః 2-11
ఇది మన సాధకగీతలో మొదటి శ్లోకం. విషాదంతో ప్రారంభమవుతున్నది. గీత. విషాదమే జీవితానికున్న ఏకైక సమస్య. ఇది ఒక అర్జునుడికే గాదు. అర్జునుడు నరుడైతే మనమంతా కూడా నరులమే. కాబట్టి నరులందరికీ ఉన్న సమస్యే ఇది. ఏమిటా సమస్య. ఎప్పుడూ శోకిస్తూ ఉండటం. ఎవరిని గూర్చి శోకించటం. ఎవరిని గూర్చి శోకించకూడదో వారిని గూర్చి. ఎవరా శోకించ గూడని వారు. గతాసువులు. అంటే చనిపోయిన వారు. చచ్చిపోయిన పుత్ర మిత్ర కళత్రాదులను గూర్చి ఎప్పుడూ పరితపిస్తుంటాడు మానవుడు. అలాగే అగతాసుపులు. బ్రతికున్న వారిని గురించి కూడా బాధపడు తుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు వారిమాదిరే వీరుకూడా పోకతప్పదు గదా అని.
ఇలా వ్యథ చెందటంవరకే అయితే బాగుండును. అదేదో అజ్ఞానంవల్ల తెలియక అలా బాధ పడుతున్నారని సమాధానం చెప్పుకోవచ్చు. అలాంటిది కాదిక్కడ వ్యవహారం. అన్నీ తెలిసిన ప్రజ్ఞావంతుల లాగా మరలా అభి నయిస్తుంటారు మానవులు. అర్జునుడు ప్రదర్శిస్తున్న దిప్పు డిలాంటి ప్రజ్ఞా వాదమే. భీష్మ ద్రోణాదులను చంపితే తనకు పాపం వస్తుందనీ- దానివల్ల నరకంలో పడవలసి వస్తుందనీ- పితృపితామహాదులంతా అలాంటి కుల పాంసనుల మూలంగా ఉత్తమగతులు లేకుండా పోతారనీ- ఇలా ఏకరువు పెడుతూ పోతాడర్జునుడు. చచ్చిన తరువాత జీవుడనే వాడుంటాడనే విషయం తెలియకపోతే అతడీ పుణ్యపాపాలూ -స్వర్గనరకాలనూ గూర్చి ఎలా చర్చించ గలడు. చర్చించాడంటే అప్పటికి శరీరం కంటే భిన్నంగా జీవుడనే వాడొక డున్నాడని గ్రహించాడనే అర్థం. గ్రహించే ప్రజ్ఞ ఉన్నప్పుడిక భీష్మాదులు మరణిస్తున్నారే అని దుఃఖపడటం దేనికి. మరణించినా అదివారి శరీరమేగాని శరీరి అయిన జీవుడు కాదు గదా.
Page 1